Home » తాజా వార్తలు » సరైన మార్గనిర్దేశనం చేస్తారని ఆశిస్తున్నాను అంటూ కేటీఆర్ కు అనసూయ చేసిన ట్వీట్ వైరల్….

సరైన మార్గనిర్దేశనం చేస్తారని ఆశిస్తున్నాను అంటూ కేటీఆర్ కు అనసూయ చేసిన ట్వీట్ వైరల్….

యాంకర్ అనసూయ తనకు సంబంధించిన ఫోటోలను,వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివా గా ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే.అలాగే ఆమె సామజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు.తనపై వ్యతిరేక కామెంట్స్ చేసే వారికీ కూడా గట్టిగానే సమాధానం ఇస్తుంటారు అనసూయ.ఇటీవలే తాజాగా యాంకర్ అనసూయ తెలంగాణ ఐటీ పురపాలక శాఖా మంత్రి అయినా కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ చేసారు.కేటీఆర్ కు సరైన మార్గ నిర్దేశం చేయాల్సిందిగా కోరారు అనసూయ.

స్కూల్ కు వెళ్లే పిల్లలకు వాక్సినేషన్ జరగలేదు.స్కూల్స్ తల్లితండ్రులను పిల్లల విషయంలో ఎందుకు బలవంతం చేస్తున్నాయి అని అన్నారు అనసూయ.తల్లితండ్రుల నుండి పిల్లల విషయంలో ఏదైనా జరిగితే స్కూల్ బాధ్యత లేదని సంతకాలు తీసుకోవడం యెంత వరకు కరెక్ట్ అని అనసూయ చెప్పారు.ఎప్పటిలాగే ఈ విషయంలో కూడా సరైన మార్గ నిర్దేశనం చేస్తారని భావిస్తున్నానని అనసూయ తన ట్వీట్ లో కోరారు.ముందు లాక్ డౌన్ వచ్చింది ఆ తర్వాత అన్ లాక్ కూడా వచ్చింది అదంతా మనం అర్ధం చేసుకోవాలి.

మనందరికీ వాక్సినేషన్ జరుగుతుంది కాబట్టి మనకు భరోసా ఉంటుంది కానీ వాక్సినేషన్ వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంగతి ఏంటి అని ఆమె ప్రశ్నించారు.ఎప్పటిలాగానే సరైన మార్గనిర్దేశనం చేస్తారని భావిస్తున్నాను అని అనసూయ ట్వీట్ చేసారు.మనమందరం కట్టివేయబడిన స్థితిలో ఉన్నాము అని అనసూయ ట్వీట్ లో తెలిపారు.ఈ ట్వీట్ లో అనసూయ విద్య శాఖా మంత్రి అయినా సబితా ఇంద్రా రెడ్డి ని కూడా ట్యాగ్ చేసారు.సోషల్ మీడియాలో ఇప్పుడు అనసూయ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *