ప్రస్తుతం ఈమె రాజకీయాలు,కుటుంబ బాధ్యతలతో బిజీ గా గడుపుతున్నారు.ఒకప్పుడు ఈమె క్షణం కూడా ఖాళీ లేకుండా సినిమాలు చేసేవారు.ఖుష్బూ స్టార్ డైరెక్టర్ అయినా సుందర్ ను 2000 లో వివాహం చేసుకోవడం జరిగింది.ఈ దంపతులకు అవంతిక,ఆనందితా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.ప్రస్తుతం పెద్ద కూతురు అవంతిక సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు.సోషల్ మీడియా వేదికగా ఈ విషయం గురించి మాట్లాడిన ఖుష్బూ తన పెద్ద కూతురును ఆశీర్వదించాలని అందరిని కోరారు.
ఖుష్బూ మాట్లాడుతూ అవంతిక ఎన్నో కలలతో లండన్ లోని బెస్ట్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకోని ఇప్పుడు సినిమాలలోకి రావడానికి రెడీ గా ఉంది.మేము ఆమెను లాంచ్ చేయడం లేదు మరియు అదే విధంగా మేము సిఫార్సు చేయడం లేదు.ఆమె స్వతాహాగా సినిమా ఇండస్ట్రీలోకి వస్తుంది.నా కూతురును అందరు దీవించాలి..అందరి ప్రేమాభిమానాలు అందించాలి అంటూ ఖుష్బూ కోరారు.ఆనందితా అప్పటి ఇప్పటి ఫోటోలు చూసిన నెటిజన్లు షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.