మామిడి తోటలో భర్తతో కలిసి అనసూయ చేసిన రచ్చ మాములుగా లేదుగా…పిక్స్ వైరల్…

సినిమా ఇండస్ట్రీలో ఉండే నటి నటులకు సంబంధించిన గాసిప్స్,ఫోటోలు,వీడియోలు ఇలా ప్రతిదీ నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే తాజాగా యాంకర్ అనసూయ తన భర్త తో కలిసి మామిడి తోటలో చేసిన సందడి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.పొట్టి దుస్తుల్లో థైస్ అందాలు కనిపించేలా ఉన్న అనసూయ ఫోటోలు ప్రస్తుతం అందరిలో సెగలు పుట్టిస్తున్నాయి.సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఫోటోలను చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అనసూయ భరద్వాజ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు అంటూ ఎవరు ఉండరు.చురుకైన మాటలతో తన అందంతో బుల్లితెర మీద ఉన్న గ్లామరస్ యాంకర్లలో ఈమె కూడా ఒకరు.జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ తో అనసూయ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యి యెనలేని క్రేజ్ ను ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.యాంకరింగ్ గా చేస్తున్న సమయంలోనే సినిమాలలో అవకాశాలు రావడంతో నటిగా కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది అనసూయ.

రంగస్థలం,పుష్ప సినిమాలలో అనసూయ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.వీలు దొరికినప్పుడల్లా హాట్ హాట్ గ్లామర్ ఫోటోలు నెట్టింట్లో షేర్ చేస్తూ యువతలో హీట్ పెంచుతుంది ఈ ముద్దుగుమ్మ.తాజాగా అనసూయ తన భర్తతో కలిసి మామిడి తోటలో సందడి చేసింది.మామిడి కాయలు కోసే క్రమంలో అవి అందకపోవడంతో అనసూయ భర్త అమాంతం ఆమెను ఎత్తుకున్నాడు.భర్తతో కలిసి మామిడి కాయలు కోస్తూ రొమాంటిక్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది అనసూయ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *