Home సినిమా షో జరుగుతుండగా స్టేజి మీద కళ్ళు తిరిగిపడిపోయిన యాంకర్ రష్మీ…

షో జరుగుతుండగా స్టేజి మీద కళ్ళు తిరిగిపడిపోయిన యాంకర్ రష్మీ…

0
Anchor Rashmi

తెలుగు బుల్లితెర మీద ప్రసారం అవుతున్న ఎంటర్టైన్మెంట్ షో లలో శ్రీదేవి డ్రామా కంపెనీ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ షో ప్రతి ఆదివారం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ప్రసారం అవుతుంది.ఈ షో మొదలైనప్పటి నుంచి మొన్నటి వరకు ఈ షో కు హోస్ట్ గా సుడిగాలి సుధీర్ ఉండేవారు.ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సినిమాలలో బిజీ గా ఉండటంతో ఈ షో కు హోస్ట్ గా యాంకర్ రష్మీ చేస్తున్నారు.కొత్త టాలెంట్ ను ప్రతి ఆదివారం పరిచయం చేస్తూ ఇన్స్పిరేషనల్ స్కిట్స్ చేస్తూ ఈ షో ప్రేక్షకులను యెంత గానో ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ షో కు సంబంధించి రిలీజ్ అయినా ప్రోమో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ఈ ప్రోమో లో షో అంత కూడా ఎంతో సరదాగా సాగింది.ఈ షో స్టార్ట్ అయి నప్పటి నుంచి కూడా హైపర్ ఆది యాంకర్ రష్మీ పై సరదాగా పంచ్లు వేస్తూ ఉన్నాడు.అయితే ఈ ప్రోమో లో ఇమాన్యుల్ వెనుక నుంచి వచ్చి పూర్ణ భుజం మీద చేయి వేస్తాడు.వెంటనే సీరియస్ అయినా పూర్ణ..ఇమాన్యుల్ తో ఏం చేస్తున్న నువ్వు..అలా ఎలా టచ్ చేస్తావ్ అంటూ సీరియస్ అయి అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగింది.అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కానీ స్థితిలో పూర్ణ వెళ్లిపోవడంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు.

Anchor Rashmi
Anchor Rashmi

హీరోయిన్ పూర్ణ ఈ షో కు జడ్జి గా రావడం జరిగింది.అయితే ఇమాన్యుల్,జడ్జి పూర్ణ మధ్య సడన్ గా వివాదం జరగడంతో యాంకర్ రష్మీ స్పృహ తప్పి స్టేజి మీదనే పడిపోయిందని తెలుస్తుంది.ప్రస్తుతం యాంకర్ రష్మీ స్పృహ కోల్పోయిన వీడియొ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ వెళ్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here