ఏపీ పిజి సెట్ దరఖాస్తుకు నోటిఫికేషన్ విడుదల…

ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 -2023 విద్యాసంవత్సరానికి పిజి మొదటి సంవత్సరం ప్రవేశాలకు జూన్ 22 న నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా యోగి వేమన యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ అయినా మునగాల సూర్య కళావతి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 యూనివర్సిటీలు,అనుబంధ పోస్ట్ గ్రాడ్యువేషన్,ప్రైవేట్ అన్ ఎయిడెడ్,మైనారిటీ కాలేజీల్లో ఏపీ పిజి సెట్ 2022 ద్వారా ప్రవేశాలు కల్పిస్తుంది.అధికారిక వెబ్ సైట్ అయినా www .yvu .edu .in లేదా https ://cets.apsche .ap .gov .in ఆసక్తి కలిగిన విద్యార్థులు జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు.

Advertisement

అయితే ఈ నోటిఫికేషన్ ప్రకారం జులై 20 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.ఆలస్య రుసుము రూ.500 చెల్లించి జులై 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఆలస్య రుసుము రూ 1000 రూపాయలతో జులై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఆగష్టు 5 నుంచి హాల్ టిక్కెట్లు ఆన్లైన్ లో అందుబాటులోకి రానున్నాయి.ఏపీ పిజి సెట్ 2022 గాను ప్రవేశ పరీక్షలు ఆగష్టు 17 నుంచి 22 వరకు జరగనున్నాయి.అయితే అభ్యర్థులు ఒక సబ్జెక్టు కు ఒకే ఒకే ఫీజు,ఒకే అప్లికేషన్ ద్వారా దాని పరిధిలోని అన్ని కోర్సులకు అర్హులు అవుతారు అని సూచించారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *