Home సినిమా గంగోత్రి సినిమా హీరోయిన్ ఎలా మారిపోయిందో తెలుసా…ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే…

గంగోత్రి సినిమా హీరోయిన్ ఎలా మారిపోయిందో తెలుసా…ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే…

0
Gangotri Aditi Agarwal
Gangotri Aditi Agarwal

సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లను ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు.ఒకప్పుడు తమ అందంతో,నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపిన హీరోయిన్లు చాల మంది ఉన్నారు.అయితే వాళ్ళందరూ ఇప్పుడు మన మధ్య ఉన్న లేకపోయినా కూడా వాళ్ళు చేసిన సినిమాల ద్వారా ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతారు.అలాంటి హీరోయిన్లలో ఆర్తి అగర్వాల్ కూడా ఒకరు అని చెప్పచ్చు.న్యూ జెర్సీ లో పుట్టి పెరిగిన ఆర్తి అగర్వాల్ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సలహా మేరకు హిందీ పాగలప్పన్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇక ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ కు జోడిగా నువ్వునాకునచ్చవ్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

తెలుగులో ఆర్తి అగర్వాల్ ఇంద్ర,నీ స్నేహం,వసంతం,నేనున్నాను,సంక్రాంతి,గోరింటాకు,అందాల రాముడు వంటి సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది.తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆర్తి అగర్వాల్.ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ చెల్లెలు అతిధి అగర్వాల్ అల్లు అర్జున్ కు జోడిగా గంగోత్రి సినిమాలో నటించి సంచలన విజయం అందుకుంది.

Aditi Agarwal
Aditi Agarwal

ఈ సినిమా హిట్ తర్వాత అతిధి అగర్వాల్ కు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.ఈ క్రమంలోనే ఆమె వర్షం సినిమాలో ప్రభాస్ కు జోడిగా నటించడానికి అవకాశం దక్కించుకుంది.కానీ అదే సమయంలో ఆమె వేరే సినిమాకు డేట్స్ ఇవ్వడంతో ఈ సినిమాను మిస్ చేసుకుంది.ఇక ఆ తర్వాత హీరో నితిన్ కు జోడిగా శ్రీ ఆంజనేయం అనే సినిమాలో కూడా నటించడానికి ఓకే చేసింది.

Aditi Agarwal
Aditi Agarwal

కానీ కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఒక సాంగ్ లో ఫుల్ రొమాంటిక్ గా చేయాలనీ దర్శకుడు చెప్పడంతో ఆమె నో చెప్పి తప్పుకోవాల్సి వచ్చింది.ఆర్తి అగర్వాల్ మరణించిన తర్వాత ఆ ప్రభావం తీవ్ర స్థాయిలో అతిధి అగర్వాల్ మీద పడింది.తన అక్క మరణించిన తర్వాత అతిధి అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉంటూ పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా జీవితం గడుపుతుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here