Home తాజా వార్తలు మళ్ళీ భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు…ఏ నగరంలో ఎంతంటే…

మళ్ళీ భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు…ఏ నగరంలో ఎంతంటే…

0

ప్రతి రోజు బులియన్ మార్కెట్ లో పసిడి వెండి ధరలలో మార్పులు చోటు చేసుకుంటాయి అనే సంగతి అందరికి తెలిసిందే.ఈ ధరలు ఒక్కోసారి పెరిగితే..మరికొన్ని సార్లు తగ్గడం కూడా చూసే ఉంటాము.అయితే గత కొన్ని రోజుల నుంచి వీటి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి.తాజాగా కూడా పసిడి మరియు వెండి ధరలు పెరిగాయి.శనివారం ధరల ప్రకారం 22 క్యారెట్ ల 10 గ్రాముల పసిడి ధర మార్కెట్ లో రూ 48100 ఉండగా,24 క్యారెట్ల పసిడి ధర రూ 52470 గా ఉంది.22 క్యారెట్ ల పసిడి పై 500 మరియు 24 క్యారెట్ ల పసిడి పై రూ 540 మేర పెరగడం జరిగింది.

ఇక దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ 1300 పెరిగి రూ 62700 గా నమోదు అయ్యింది.దేశ రాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ ల 10 గ్రాముల పసిడి ధర రూ 48100 మరియు 24 క్యారెట్ ల పసిడి ధర రూ 52470 ఉంది.ఇక తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ లో 22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర రూ 48100 మరియు 24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర రూ 52470 ఉంది.ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 48100 మరియు 24 క్యారెట్ ల ధర రూ 52470 ఉంది.ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ 68500 మరియు విజయవాడలో కిలో వెండి ధర రూ 68500 గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here