షాక్ అయ్యేలా మారిపోయిన కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్…ఇప్పుడు ఏం చేస్తుందంటే…

Swetha Basu Prasad

సినిమా ఇండస్ట్రీలో చాల మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.వారిలో కొంతమంది హీరోయిన్లు మాత్రం మంచి క్రేజ్ ను సంపాదించుకొని స్టార్ హీరోయిన్లుగా రాణిస్తారు.మరికొంత మంది మాత్రం యెంత వేగంగా మంచి గుర్తింపు తెచుకుంటారో అంటే వేగంగా సినిమా ఇండస్ట్రీకు దూరం అయిపోతారు.అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరు కొత్త బంగారు లోకం సినిమా హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్.కొత్త బంగారు లోకం సినిమాలో తన నటనతో,అందంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా బసు ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలలో నటించిన కూడా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది.

Swetha Basu Prasad
Swetha Basu Prasad

ఇక మొదటి సినిమా చేసిన మూడేళ్లకే ఐటెం సాంగ్ తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అమ్మడు.బీహార్ కు చెందిన శ్వేతా బసుప్రసాద్ మొదట హిందీ సినిమాలలో మరియు సీరియల్స్ లలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.2010 లో రిలీజ్ అయినా కళావర్ కింగ్ అనే సినిమాలో చివరిసారిగా హీరోయిన్ గా నటించింది శ్వేతా.ఆ తర్వాత ఐటెం సాంగ్స్ లలో కూడా చేసింది.ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలలో మరియు వెబ్ సిరీస్ మీద ఫోకస్ పెట్టిన శ్వేతా ప్రస్తుతం గునేగార్ అనే తేలి సిరీస్ లో నటిస్తుంది.

గునేగార్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా పాల్గొంటున్న శ్వేతా ను చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.కొత్త బంగారు లోకం సినిమాలో ఎంతో అందంగా,క్యూట్ గా కనిపించిన శ్వేతా ప్రస్తుతం ఇలా అయిపోయిందేంటి అంటూ అనుకుంటున్నారు నెటిజన్లు.శ్వేతా హీరోయిన్ గా ఉన్న సమయంలోనే రోహిత్ మిట్టల్ అనే ఫిలిం మేకర్ ను పెళ్లి చేసుకుంది.కానీ అనుకోని కారణాల వలన వీరిద్దరూ ఒక సంవత్సరానికి విడిపోయారు.

Swetha Basu Prasad
Swetha Basu Prasad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *