మీ ఇంట్లో ధనం ఉండాలి, ఎప్పటికి ఆర్ధికసమస్యలు రాకుండా ఉండాలంటే…ఇలా చేయాలి..

చాల మంది ఇంట్లో ఆర్ధిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు.యెంత సంపాదించినా కూడా వచ్చే ధనం నిల్వ ఉండదు.ఇలా ఆర్ధిక సమస్యల కారణంగా అప్పు తీసుకోవడం మల్లి ఆ అప్పును తీర్చలేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి.ఇలా ఆర్ధిక సమస్యలు ఎప్పుడు ఏర్పడకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలను పాటించాలి అని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.ఈ చిట్కాలను కనుక మనం పాటిస్తే ఇంట్లో ఎప్పుడు ఆర్ధిక సమస్యలు ఏర్పడవు అని చాల మంది నిపుణులు చెప్తున్నారు.మనం మన ఇంట్లో వంట చేసుకోవడానికి చాల రకాల పదార్ధాలను వాడుతూ ఉంటాము.

అయితే మనం వంట చేసే పదార్ధాలలో కొన్ని పదార్ధాలు అయిపోతే ఆర్ధికసమస్యలు ఏర్పడతాయి అని నిపుణులు చెప్తున్నారు.అవి ఏంటంటే…మొదటిది పసుపు..ఇంట్లో ఎప్పుడు పసుపు అయిపోయే వరకు ఉండకూడదు.అలా పసుపు అయిపోతే ఇంట్లో ఆనందం ఉండదని చెప్తున్నారు నిపుణులు.అలాగే గురు దోషం,ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుందట.

అందుకే పసుపు అయిపోక ముందే తెచ్చిపెట్టుకోవాలి అంటున్నారు నిపుణులు.రెండోది…ఉప్పు…ఇంట్లో ఉప్పు కూడా అయిపోక ముందే తెచ్చి పెట్టుకోవాలి.ఉప్పు పూర్తిగా అయిపోతే ఆర్ధికసమస్యలు ఏర్పడతాయట.మూడోది…పిండి…ఇంట్లో పిండి అయిపోవడం వలన ధన నష్టం మరియు ఇంట్లో ఇబ్బందులు కలుగుతాయి అని చెప్తున్నారు నిపుణులు.అలానే…ఇంట్లో బియ్యం అయిపోయిన కూడా ఆర్ధికసమస్యలు ఇంట్లో ఇబ్బందులు ఏర్పడతాయి.అందుకే ఈ పదార్ధాలు అన్ని అయిపోకుండా చూసుకుంటే ఆర్ధిక సమస్యలు ఏర్పడవు అని చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *