టాలీవుడ్ ఇండస్ర్టీపై నటసింహం బాలయ్య బాబు ఏం చేసినా కొత్తగా ఉంటుంది. ఆయన స్టయిలే వేరు.. ఫ్యాన్ ఫాలోయింగ్ లో సైతం ఆయన అందరికంటే ముందుంటారు. ఇటీవల ఆయన ఒక ఈవెంట్ లో తన సిగ్నేచర్ (సంతకం) చేశారు. అది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇటీవల నందమూరి బాలయ్య సాయిప్రియా కన్ర్టక్చన్స్ (రియల్ ఎస్టేట్ యాజమాన్యం)కు సంబంధించి ఒక యాడ్లో నటించారు. యువరత్న కెరీర్ లో ఇది మొదటి యాడ్. ఆయన ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నారు. యాడ్కు సంబంధించి ఒక ఈవెంట్లో పాల్గొన్నారు బాలయ్య బాబు. ఈ సందర్భంగా యాడ్ డైరెక్టర్ ఆనంద్ గుర్రంకు రూ. 20లక్షల విలువైన కారును కూడా బహూకరించారు.
ఈ వెంట్ లో భాగంగా ఆయన సిగ్నేచర్ చేశారు. బాలయ్య బాబు సిగ్నేచర్ కు తన అభిమానులు ఫిదా అయిపోయారట. నటసింహం నందమూరి బాలయ్య బాబు సిగ్నేచర్ ను ఇంత కాలానికి చూశామంటూ మురిసిపోతున్నారంట. ఏది ఏమైనా తన సిగ్నేచర్ తో సైతం బాలయ్య సినీ ప్రేక్షకులను మరో సారి గెలుచుకున్నారడంలో సందేహం లేదనే చెప్పాలి.