ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో చాల మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు,ఎన్టీఆర్,అల్లు అర్జున్ ఇలా చాల మంది స్టార్ హీరోలు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.అయితే చిరుత సినిమా తో మెగా వారసుడిగా ఇండస్ట్రీ కి హీరోగా పరిచయమైనా రామ్ చరణ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా చేసిన సంగతి చాల మంది ప్రేక్షకులకు తెలీదని చెప్పచ్చు.రామ్ చరణ్ ను చాల మంది దర్శకులు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చెయ్యాలి అని అనుకున్నారు.
అయితే దాసరి నారాయణరావు గారికే కుదిరిందని చెప్పచ్చు.మెగా స్టార్ చిరంజీవి హీరోగా,దాసరి నారాయణ రావు హీరోగా తెరకెక్కించిన చితం లంకేశ్వరుడు లో రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.అయితే సినిమా ఎడిటింగ్ సమయంలో రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సన్నివేశాలు తీసివేయడంతో మనం రామ్ చరణ్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా చూడలేకపోయాము.అయితే రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సన్నివేశాలు తీసివేయకపోతే బాగుండేదని అభిమానులు అనుకుంటున్నారు.
అయితే తాజాగా రామ్ చరణ్,ఎన్టీఆర్ కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ చిత్రం మార్చ్ 5 న రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి కురిపిస్తుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో,ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో అద్భుతంగా నటించారు.డి వి వి దానయ్య నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.మరోపక్క రాంచరణ్ నటించిన ఆచార్య చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.