
Railways Rules: భారతీయ రైల్వేలో నిత్యం కోట్ల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. భారతీయ రైల్వే లైను భారత దేశ జీవనాడి అని కూడా పిలుస్తారు. అయితే భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అనేక నియమ నిబంధనలను రూపొందించిన సంగతి తెలిసిందే. రైలులో ప్రయాణం చేసేటప్పుడు ఈ నియమాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
లేకపోతే ఏ చిన్న పొరపాటు చేసినా కూడా భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. కొన్ని కొన్ని సార్లు జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు. రైల్వే సిబ్బంది ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రైలులో ఉన్న కొన్ని భోగిలలో అత్యవసర చేయన ఏర్పాటు చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ అలారం గొలుసును ఉపయోగించవచ్చు.
మీరు ఆ గొలుసును తప్పుడు మార్గంలో లేదా ఎలాంటి కారణం లేకుండా ఉపయోగించినట్లయితే జైలు శిక్ష కూడా పడవచ్చు. రైల్వే చట్టం 1989 లోని సెక్షను 141 ప్రకారం ఎలాంటి సహితుకమైన కారణం లేకుండా అత్యవసరంగా ఉపయోగించే అలారం గొలుసును లాగడం నేరం. ఒకవేళ మీరు ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే మీకు 1000 రూపాయలు జరిమానాలతో పాటు ఒక సంవత్సరం జై లవకుశ కూడా పడుతుంది.
కొన్నిసార్లు మీకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు లేదా జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు. ట్రైన్ లో ఉండే అత్యవసర అలారం గొలుసు మీరు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి.రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో రైలులో మంటలు చెలరేగినట్లయితే లేదా ఒక పిల్లవాడు లేదా వృద్ధుడు రైలు ఎక్కడ లేకపోతే లేదా రైలులో ఎవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు అలాగే ప్రయాణంలో దొంగతనం లేదా దోపిడీ వంటివి జరిగినప్పుడు ఈ అతి అవసరం అలారం గొలుసును ఉపయోగించవచ్చు. రైలులో ప్రయాణం చేసేటప్పుడు మీరు ఈ నియమాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.