Ration card: రేషన్ కార్డు ఉన్నవారికి జూన్ 30 వరకు మాత్రమే గడువు.. వెంటనే ఇంటి దగ్గర నుంచే ఇలా చేయండి

Ration card
Ration card

Ration card: రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఇప్పటివరకు మీరు రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ చేయకపోతే చేయండి. లేకపోతే ఇకపై మీ రేషన్ నిలిచిపోతుంది. తాజాగా ప్రభుత్వం అన్ని రేషన్ కార్డు దారులు కూడా జూన్ 30 నాటికి ఈ కేవైసీ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ గడువు తేదీ ముగిసిన నాటికి ఎవరైనా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఇకపై వారి ఆహార ధాన్యాలు నిలిపివేస్తారు. పట్టణ ప్రాంతాలలో ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులు చాలామంది ఇప్పటివరకు ఈ కేవైసీ పూర్తి చేశారు. అయితే మరి కొంతమంది రేషన్ కార్డుదారులు మాత్రం ఇంకా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి.

గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇప్పటివరకు లక్షల రేషన్ కార్డు ఉన్నవాళ్లు ఈ కేవైసీ పూర్తి చేసినట్టు సమాచారం. మరి కొంతమంది ఈ కేవైసీ ఇంకా పెండింగ్లో ఉంది. రేషన్ కార్డులకు అనర్హులు అలాగే మరో ప్రదేశానికి వెళ్ళిన వారు లేదా మరణించిన వారి పేర్లను గుర్తించి రేషన్ కార్డుల నుంచి తొలగించనున్నారు. అర్హత ఉండి రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు మాత్రమే ఇకపై రేషన్ పంపిణీ చేయనున్నారు. మీరు మీ సంబంధిత రేషన్ డీలర్ ద్వారా కూడా రేషన్ కార్డుకు సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

ఈ కేవైసీ పూజ చేయడం వలన రేషన్ కార్డుదారులు ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీరు మీ ఇంటి దగ్గర నుంచి కూడా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. దీనికోసం మీరు కేవైసీ యాప్ లో వెళ్లి ఆధార్ ఫేస్ ఆర్ డి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అందులో మీరు ముందుగా మైకేవైసీ ఆధార్ ఫేస్ ఆర్ డి యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత ఆ యాప్ లో మీ స్టేట్ మరియు లొకేషన్ ఎంపిక చేసుకోండి. మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి మొబైల్ ద్వారా ఓటిపి ఎంటర్ చేయండి. మీ పూర్తి వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఫేస్ స్కాన్ మొబైల్ సెల్ఫీ కెమెరాతో మీరు స్కానింగ్ చేసి ఫేస్ ఈ కేవైసీ ఆప్షన్ ఎంపిక చేసుకోండి. ఇలా చేయడం వలన రేషన్ కార్డుకు సంబంధించి మీ ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయినట్లు.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now