1st July: ఈ ఏడాది జులై 1, 2025 నుంచి రైలు టికెట్ల దగ్గర నుంచి గ్యాస్ ధరలు అలాగే ఆధార్ కార్డుల లింక్ వంటి అనేక నియమాలలో కొత్త మార్పులు రాబోతున్నాయి. ఒక సామాన్యుడి రోజు వారి ఖర్చులకు ఈ మార్పులు బాగా ప్రభావితం చేస్తాయి. జూలై నెల ప్రారంభం నుంచి అనేక కొత్త మార్పులు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా అన్ని వస్తువులకు సంబంధించి జూలై 1, 2025 నుంచి కొత్త నియమాలు రానున్నాయి.
సామాన్యులపై ఇవి నేరుగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. రైల్వే టికెట్ బుకింగ్ నియమాలతో పాటు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు అలాగే పాన్ కార్డు సంబంధిత ప్రక్రియలు మరియు బ్యాంకింగ్ చార్జీలు ఇలా అనేక నియమాలు మారనున్నాయి. ప్రతి నెల మొదటి తేదీన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర మారుతుంది. జులై 1న కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మారే అవకాశం ఉంది. సామాన్యులపై ఇది ప్రభావం చూపిస్తుంది. అలాగే జూలై 1, 2025 నుంచి మీరు కొత్తగా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి అంటే మీకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.
ఇకపై ఆధార కార్డు లేకుండా కొత్త పాన్ కార్డు ఇవ్వరు. అలాగే పాన్ కార్డును ఆధార్ కార్డుతో కూడా లింక్ చేయడం తప్పనిసరిగా మారింది. దీనికోసం డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే గడువు ఉంది. అలాగే రైల్వే టికెట్ల బుకింగ్ మరియు చార్జీలలో కూడా జూలై 1 నుంచి కొత్త నియమాలు రానున్నాయి. ఏసీ మరియు నాన్ ఏసీ తరగతులకు సంబంధించిన రైల్వే టికెట్ ధరలు స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది. నాన్ ఎసి తరగతిలో కిలోమీటర్ కు టికెట్ పై ఒక పైసా అలాగే ఏసీ తరగతిలో కిలోమీటర్కు టికెట్ పై రెండు పైసలు చార్జీలు పెరిగాయి. అలాగే రైల్వేలలో ఇకపై వెయిటింగ్ టికెట్ల సంఖ్య పై కూడా పరిమితిని నిర్ణయించడం జరిగింది. ప్రతి తరగతిలో కూడా 25 శాతానికి మించి సీట్లలో వెయిటింగ్ టికెట్లను ఇకపై జారీ చేయరు.