AP Inter Results 2025 Today: 2024-25 విద్యా విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్టియర్ మరియు సెకండియర్ విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసి ఫలితాలు ఎప్పుడెప్పుడా అంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఇంటర్ బోర్డు ఇంటర్ విద్యార్థులకు కీలక పెరగటన జారీ చేసింది. ఏప్రిల్ 12, శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.
మరి కాసేపట్లో ఇంటర్ విద్యార్థుల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 12, శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సర ఫలితాలు వెల్లడించనున్నారు. ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఇంటర్ విద్యార్థులు నేరుగా ఇంటర్ బోర్డు అధికార వెబ్సైట్లో కాని లేదా టీవీ9 తెలుగు వెబ్సైట్లో కాని ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
అలాగే ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 కు hi అనే మెసేజ్ పెట్టి కూడా ఫలితాలను ఈజీగా తెలుసుకోవచ్చు. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ రెగ్యులర్గా మరియు ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు 26 జిల్లాలలో మొత్తం 1535 కేంద్రాలలో దాదాపుగా 10,58,892 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ పరీక్షలను రాయడం జరిగింది.
ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి మార్చి 20వ తేదీ వరకు జరిగాయి. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు జరగగా, ఇంటర్ సెకండియర్ పరీక్షలు మార్చి మూడు నుంచి 20 వరకు జరిగాయి. ఇంటర్ పరీక్షలు పూర్తి అయిన కేవలం 20 రోజుల్లోనే ఇంటర్ బోర్డు మూల్యాంకనం ప్రక్రియను పూర్తి చేసి ఇంటర్ బోర్డు ఫలితాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.