UPI Payments: తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ పర్సన్ మర్చంట్ పేమెంట్స్కు యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ నో సవరించే అధికారాన్ని ఎంపీసీఐకి ఇచ్చింది. దీంతో ఎడ్యుకేషన్ ఫీజులతోపాటు ఆరోగ్య అవసరాలకు యూపీఐ లిమిట్ ని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మానిటరీ పాలసీ కమిటీ సమావేశం తర్వాత కొన్ని కీలక మార్పులను చేపట్టింది.
ఈ క్రమంలో రెపోరేటులో 0.25% తగ్గింపుతో 6 శాతానికి తీసుకొని వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా బ్యాంకులు, పింటెకు కంపెనీలు, యూపీ ట్రాన్సాక్షన్స్ లిమిట్ కి సంబంధించి కొత్త ప్రతిపాదనలను తీసుకొచ్చారు. ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫస్ పర్సన్ టు పర్సన్ మరియు పర్సెంటు మర్చంట్ లక్ష రూపాయల వరకు పేమెంట్ చేయడానికి అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిసార్లు పర్సెంటు మర్చంట్ కేసుల్లో లిమిట్ ఎక్కువగానే ఉంది.
ఇది చదవండి: రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియను ఇంటి నుంచే ఇలా సులభంగా చేసుకోండి
అంటే యూపీఐ ఎడ్యుకేషన్ ఫీజులు మరియు ఆరోగ్య అవసరాలకు లిమిట్ ని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు చేసుకొనే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తుంది. తాజాగా ఇన్ పర్సన్ మర్చంట్ పేమెంట్స్ కు యుపిఐ ట్రాన్సాక్షన్ లిమిట్ సవరించే అధికారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐకి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఎన్పీసీఐ యూపీఐ సిస్టంలోని బ్యాంకులో మరియు ఇతర కీలక సంస్థలతో సంప్రదించి చర్యలు తీసుకోబోతుంది.
అయితే ఇన్ పర్సన్ మర్చంట్ పేమెంట్ అంటే వినియోగదారుడి వస్తువులు లేదా సేవల కోసం ఫిజికల్ లొకేషన్ లో ఉండి నేరుగా మర్చంట్ కి చేసే పేమెంట్ అన్నమాట. ముఖ్యంగా ఈ పేమెంట్లు స్టోర్ మరియు రెస్టారెంట్ వంటి ప్లేస్ లో జరుగుతూ ఉంటాయి. ఎన్పీసీఐ వినియోగదారుని అవసరాలను బట్టి పర్సెంటు మర్చంట్ యూపీఐ ట్రాన్సాక్షన్లో లిమిట్ ని సవరించే అవకాశాన్ని కల్పించింది.