ATM Charges: ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసే వినియోగదారులకు మే ఒకటి, 2025 నుంచి అధిక చార్జీలు తప్పవు. ఏటీఎం విత్డ్రా చేసే పరిమితి దాటితే ప్రతి లావాదేవీ కి కూడా రూ.23 వసూలు అవుతుంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ను అమలు చేసింది. ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసేవారు మే 1వ తేదీ నుంచి అధిక చార్జీలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ బ్యాంకులకు ఉచిత ట్రాన్సాక్షన్ లిమిట్ దాటినట్లయితే చార్జీలు వసూలు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది.
వీటిలో ఏటీఎంలను కలిగి ఉండడం, కార్డు మైంటైన్ చేయడం అలాగే ఇతర బ్యాంకులో కస్టమర్లకు సేవలను అందించడం వంటి ఖర్చులు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 1, 2025 నుంచి కొత్త రూల్స్ ను అమలు చేయనుంది. ఈ నిబంధనల ప్రకారం ఏటీఎం నుంచి డబ్బులను విత్డ్రా చేసే వినియోగదారులు నగదు విత్డ్రా లిమిట్ దాటినట్లయితే ఆ తర్వాత చేసే ప్రతి లావాదేవీ కి కూడా అదనంగా రూ.2 చెల్లించాలి. వినియోగదారులు నెలవారి ఉచిత పరిమితి దాటిన తర్వాత ఏటీఎంలలో ప్రతి రావా దేవికి ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.21 బదులుగా రూ.23 చెల్లించాల్సి ఉంటుంది.
సొంత బ్యాంకు ఏటీఎంలో ప్రతినెలా 5 ఉచిత ఏటీఎం లావాదేవీలను చేసుకోవచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంలో మెట్రో నగలాలలో మూడు ఉచిత లావాదేవీలు పరిమితి ఉంటుంది. ఇతర బ్యాంకు ఎటిఎంలలో మెట్రో ఏతర నగరాలు అయితే ఐదు ఉచిత లావాదేవీల పరిమితి ఉంటుంది. భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులలోని పొదుపు ఖాతాదారులందరికి ఈ రూల్స్ వర్తిస్తాయి. గతంలో ఉచిత పరిమితిని వినియోగించిన తర్వాత డబ్బును విత్ డ్రా చేసేందుకు రూ.21 వసూలు చేసేవారు. 2022లో ఈ చార్జి అమలు చేయబడింది. ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఈ సవరించిన చార్జీలు వినియోగదారులు వారి ఉచిత లావాదేవీ పరిమితి దాటిన తర్వాత మాత్రమే అమలులోకి వస్తాయని తెలుస్తుంది.
One thought on “ATM Charges: ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్న వాళ్లకి భారీ షాక్.. మే 1 నుంచి అదనపు చార్జీలు అమలు”
Comments are closed.