Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి ప్రతి ఇంట్లో పండగే

Ration Card
Ration Card

Ration Card: కూటమి ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి ఒక శుభవార్త తెలిపింది. ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ అన్ని పోషక విలువలతో ఉన్న సరుకులను పంపిణీ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవాళ్లకి కూటమి ప్రభుత్వం తాజాగా ఒక శుభవార్తను తెలిపింది. రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ పోషక విలువలతో కూడిన కందిపప్పు, తృణధాన్యాలను ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాలలో జూన్ నెల 1వ తేదీ నుంచి సరుకులతో పాటు సబ్సిడీపై కందిపప్పు అలాగే ఉచితంగా రాగులను కూడా ఇచ్చేందుకు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాబోయే మూడు నెలలకు సరిపడిన కందిపప్పును అలాగే ఏడాదికి సరిపడిన రాగులను సేకరించి ఎందుకో ప్రభుత్వం ఇటీవల టెండర్లను కూడా ఆహ్వానించడం జరిగింది. అంగన్వాడి కేంద్రాల ద్వారా కూడా ఐసిడిఎస్ లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సరిపోయేలాగా 47,037 టన్నుల రూ.500 కోట్ల విలువైన కందిపప్పు అలాగే 25 వేల టన్నుల రూ.100 కోట్లు పైగా విలువైన రాగులను వీటితోపాటు 43,860 టన్నుల పంచదారను సేకరించేందుకు కూటమి ప్రభుత్వం ఈ ప్రోక్యుర్మెంట్ విధానంలో ఎం ఈ ఎం ఎల్ పోర్టల్ ద్వారా ఇటీవల టెండర్లను ఆహ్వానించింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్లకు పైగా రేషన్ కార్డుదారులు ఉన్నట్లు సమాచారం. ప్రతినెలా రేషన్ దుకాణాల ద్వారా వీళ్ళందరికీ అందించే బియ్యానికి బదులుగా ఉచితంగా రాగులు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఉదాహరణకు ప్రతినెల 20 కిలోల బియ్యం తీసుకుంటున్న ఒక కుటుంబం 2 కిలోల రాగులను తీసుకోవాలి అనుకుంటే వాళ్లు బియ్యం కోటాలో తగ్గింపు ఉంటుంది. దీని ప్రకారం 18 కిలోల బియ్యం మరియు రెండు కిలోల రాగులను వాళ్ళు తీసుకోవచ్చు.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now