Indiramma Indlu: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వాళ్లందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించేందుకు రెడీ అవుతుంది. అర్హత కలిగిన ప్రతి కుటుంబం ఈ స్కీం ద్వారా లబ్ధి పొందే లాగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తొలి విడతలో 71 వేల మందికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను అందించింది. ప్రీ వెరిఫికేషన్ సమయంలో అధికారులు 6000 మందిని ఈ పథకానికి అనర్హులుగా గుర్తించారు.
తొలి విడతలో మొత్తం 65 వేల మంది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీళ్ళలో ఇప్పటివరకు 12,000 మంది ఇండ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అలాగే మరో 1200 మంది బేస్మెంట్ పూర్తి చేసినట్లు అధికారులు తమ నివేదికలో తెలిపారు. ఈ క్రమంలో బేస్మెంట్ పూర్తి చేసిన వాళ్లందరికీ వారం రోజుల్లో డబ్బులు వారి అకౌంట్లో రిలీజ్ చేసేలా ప్రభుత్వం దృష్టి పెడుతుంది.
తెలంగాణ రాష్ట్ర ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు దశల్లో ఐదు లక్షలు అందించండి. బేస్మెంట్ పూర్తి చేసిన వాళ్లకి తొలి దశలో లక్ష రూపాయలు ఇవ్వనుంది. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలో బేస్మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారుల ఖాతాల్లో లక్ష రూపాయలను వారం రోజుల్లో జమ చేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది.
ఇది చదవండి: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. గత నాలుగు రోజుల్లో భారీగా తగ్గిన పసిడి ధర.. ఈరోజు ధరలు ఇవే
అయితే ఇటీవల జూన్ కల్లా 45 వేల బేస్మెంట్లతో పాటు గోడలు కట్టే పనులు కూడా పూర్తి అయ్యేలా లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పిస్తూ ఫాలో అప్పు చేయాలని వీసీ లో అధికారులను హౌసింగ్ సెక్రటరీ మరియు ఎండీలు ఆదేశించారు. మొదటి దశల భాగంగా ప్రభుత్వం మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసింది.
ఈసారి ఆ విధానానికి స్వస్తి చెప్తూ మండలంలోని అన్ని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్లను ఉన్నత అధికారులు ఆదేశించడం జరిగింది. అర్హులైన వాళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేయాలని ప్రభుత్వంతో పాటు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కూడా ముందు నుంచి చెప్తున్నారు. అర్హులైన లబ్ధిదారుల వివరాలను గ్రామసభల్లో వెల్లడించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.