Home » బిజినెస్ » UPI Payments: ఈ ఫోన్ నెంబర్లు ఉన్నవాళ్లకు యూపీఐ సేవలు బంద్ చేసిన NPCI…ఎందుకంటే

UPI Payments: ఈ ఫోన్ నెంబర్లు ఉన్నవాళ్లకు యూపీఐ సేవలు బంద్ చేసిన NPCI…ఎందుకంటే

UPI Payments
UPI Payments

UPI Payments: వినియోగదారులకు టెలికాం కంపెనీలు డి ఆక్టివేట్ అయిపోయిన నెంబర్లను ఇస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఒకవేళ పాత కస్టమర్ యూపీఐ నెంబరు అదే మొబైల్ నెంబర్కు కనుక లింక్ చేసి ఉంటే కొత్త వినియోగదారుడు దానిపై అనధికార లావాదేవీలు చేయవచ్చు. ఇది చాలా పెద్ద ప్రమాదం అని తెలుస్తుంది. ఈరోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరు కూడా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఉపయోగిస్తున్నారు.

కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవలసిన విషయం. కూరగాయల విక్రయితల నుంచి టికెట్ కౌంటర్ల వరకు యూపీఐ కోడ్ను స్కాన్ చేయడం వల్ల సులభంగా చెల్లింపులు చేస్తున్నారు. కానీ తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నియమాలను అమలులోకి తెచ్చింది. ఈ నియమాల ప్రకారం ఈ కస్టమర్లు ఏప్రిల్ ఒకటి, 2025 నుంచి యూపీఐ ద్వారా చెల్లింపులు చేయలేరు.

Also Read: ఎయిర్టెల్ యూజర్లకు జబర్దస్త్ న్యూస్..చాలా చౌకైనా ప్లాన్ లో ఏడాది పాటు జియో హాట్ స్టార్ ఉచితంగా

ముఖ్యంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ మోసాలు మరియు మోసపూరిత సంఘటనలను అరికట్టడానికి చర్యలను తీసుకుంటుంది. తాజాగా ఎన్పీసీఐ అందించిన సమాచారం ప్రకారం ఒక మొబైల్ నెంబరు 90 రోజుల పాటు డిఆర్టివేట్ అయితే ఇకపై దాని నుండి యూపీఐ చెల్లింపులు చేసుకోలేరు. ఈ మొబైల్ నెంబరు యూపీఐ అనుబంధ బ్యాంక్ ఖాతా నుండి డి లింక్ చేయబడుతుంది.

ఇది యూపీఐ వ్యవస్థను మరింత సురక్షితంగా మారుస్తుందని మరియు మోసాల సంఘటనలను తగ్గిస్తుందని ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్ ఆక్టివేట్ మొబైల్ నెంబర్లను యూపీఐ కి లింక్ చేయడం వలన భద్రత లోపిస్తుంది. సాధారణంగా చాలామంది కష్టమర్లు తమ మొబైల్ నెంబర్ను మార్చినప్పుడు లేదా పాత నెంబర్ను ఉపయోగించకుండా వదిలేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఆ నెంబర్లు లింక్ చేసిన యూపీఐ ఖాతాలో యాక్టివ్గానే ఉంటాయి. అటువంటి అప్పుడు అలాంటి నెంబర్లు దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉంది.

Also Read: రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. వచ్చే నెల నుంచి బియ్యం, పంచదార తో పాటు అది కూడా పంపిణీ

ఒకవేళ మీరు ఉపయోగించి ఆపేసిన మొబైల్ నెంబర్ను సదరు టెలికాం కంపెనీ వేరే కొత్త వినియోగదారులకు కేటాయించినప్పుడు యూపీఐ లావాదేవీలు ఆ నెంబర్ ద్వారా జరుగుతాయి. అటువంటి సమయంలో యూపీఐ లావాదేవీ డబ్బులు కొత్త వ్యక్తి ఖాతాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఇటువంటి నెంబర్ల వల్ల మోసాలు కూడా పెరుగుతాయి. ఇటువంటి కొన్ని మోసాలను గుర్తించిన ఎన్పీసీఐ 90 రోజుల కాలపరిమితి పరిష్కారాన్ని తీసుకొని వచ్చింది.