Home » తాజా వార్తలు » Central Home Minister: సింధూ నది నుంచి చుక్కనీరు కూడా పాక్ కు వెళ్లకుండా ప్లాన్ వేసిన కేంద్ర ప్రభుత్వం

Central Home Minister: సింధూ నది నుంచి చుక్కనీరు కూడా పాక్ కు వెళ్లకుండా ప్లాన్ వేసిన కేంద్ర ప్రభుత్వం

Central Home Minister
Central Home Minister

Central Home Minister: ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడితో భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారతదేశం కేంద్ర ప్రభుత్వం పాక్ తో జరిగే సింధు నది జలల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా పాక్ దేశానికి సింధూ నది నుంచి ఒక చుక్క నీరు కూడా వెళ్లకుండా పూర్తిగా కట్టడి చేసేందుకు భారత కేంద్ర ప్రభుత్వం పక్కాగా ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నది జిల్లాలపై ఢిల్లీలో ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ ఉన్నత అధికారులతో సమావేశం జరిపారు.

ఈ సమావేశంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య అప్పట్లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగిన సింధూ నది నీటి ఒప్పందాలపై వారితో చర్చించారు. ఈ సమావేశంలో మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భారత్ నుండి పాకు కు సింధు నది నీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేరకుండా మూడు దశలలో పక్కా ప్లాన్ వేయాలని సూచించారు. వరల్డ్ బ్యాంకు ముందుగా మన దేశ వైఖరిని తెలుపాలని ఆయన సూచించారు. 1960 సెప్టెంబర్ లో మన దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సింధూ నది నీటి పంపిణీకి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది.

ఈ రెండు దేశ మధ్య నీటి ఒప్పందానికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం లెక్కల ప్రకారం తూర్పున ఉన్న రావి,సాట్లేజ్, బియాస్ నదులపై భారతదేశానికి పూర్తి హక్కులు ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ కు సింధు, చినాబు, జీలం నదులపై బాధ్యతను అప్పగించారు. అప్పట్లో భారత్ పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. భారత్ 1948లో పాకిస్తాన్ దేశానికి నీటిని నిలిపివేసింది. ఆ తర్వాత మళ్లీ ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవడంతో నీటి జలాలపై మళ్ళీ ఇరుదేశాలు ఒప్పందం కుదురుచుకున్నాయి. ఆ ఒప్పందం లో భారత్కు సింధూ నదిలో 20% నీరు అలాగే మిగిలిన 80 శాతం జలాలను పాకిస్తాన్ వినియోగించుకునే లాగా అప్పట్లో వెసులుబాటును కల్పించారు.