Home » తాజా వార్తలు » 10th Class Result Date: ప్రారంభమైన 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం…ఫలితాల తేదీ ఎప్పుడో తెలుసా.!

10th Class Result Date: ప్రారంభమైన 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం…ఫలితాల తేదీ ఎప్పుడో తెలుసా.!

10th Class Result Date: ప్రారంభమైన 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం…ఫలితాల తేదీ ఎప్పుడో తెలుసా.!
10th Class Result Date: ప్రారంభమైన 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం…ఫలితాల తేదీ ఎప్పుడో తెలుసా.!

10th Class Result Date: రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ మూడవ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ జవాబు పాత్రలో మూల్యాంకనం ఏడు రోజుల్లోగా పూర్తి చేసేలాగా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ అన్ని చర్యలను రూపొందించింది. ఈ మేరకు అధికారులు భారీ సంఖ్యలో ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయిస్తున్నట్లు తెలుస్తుంది.

ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. పదవ తరగతి జవాబు పత్రాలు మూల్యాంకనం ఏడు రోజుల్లోగా పూర్తి చేసే విధంగా పాఠశాల విద్యాశాఖ అని ఏర్పాట్లను పూర్తి చేసింది.

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం అవ్వగా ఏప్రిల్ 9 వరకు పూర్తి చేసే విధంగా అధికారులు అన్ని పనులను పూర్తి చేశారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని 3100 మంది ఉపాధ్యాయులకు అధికారులు విధులను కేటాయించారు. వీళ్ళందరూ 3.20 100 పేపర్లను మూల్యాంకనం చేసే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

అత్యధికంగా గుంటూరు జిల్లాకు చెందిన 1.80 లక్షల పేపర్లు మూల్యాంకనం చేసేందుకు ఉన్నాయి. కేవలం వీటి మూల్యాంకనానికి 1268 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం ఈసారి ఫలితాలను ముందుగానే వెల్లడించాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియకు ఉపాధ్యాయులను కేటాయించినట్లు సమాచారం.

అని అనుకున్నట్టు జరిగితే ఈనెల ఏప్రిల్ చివరిలోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఎక్కువమంది ఉపాధ్యాయులతో మూల్యాంకన్న ప్రక్రియ పూర్తి చేసేందుకు అన్ని చర్యలను చేపట్టింది. గుంటూరు జిల్లాకు చెందిన జవాబు పత్రాలను స్టాల్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం భద్రపరిచింది. వీటికి చెందిన మూల్యాంకనం అక్కడే జరిగేలాగా విద్యాశాఖ అని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఏప్రిల్ 9 వరకు ప్రభుత్వం మూల్యాంకన ప్రక్రియ చాలా పగడ్బందీగా నిర్వహించనుంది.