Central Govt Scheme: కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం 2018 లో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ఇది దేశంలో ఉన్న అన్ని పేద ప్రజలకు అలాగే బలహీన వర్గాల ప్రజలకు విప్లవాత్మకంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య భీమా పథకం. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులందరూ కూడా ఆయుష్మాన్ కార్డును ఉపయోగించి దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో ఐదు లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. ప్రతి ఏడాది ఆయుష్మాన్ భారత్ కాడు ఉపయోగించి లబ్ధిదారులు ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు.
ఒక ఏడాదిలో అవసరాన్ని బట్టి ఒకటి కంటే అనేకసార్లు దీనిని ఉపయోగించుకోవచ్చు. ఇచ్చిన పరిమితికి మొత్తం ఖర్చు ఉంచకూడదు. ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక ఏడాదిలో రెండు వేరువేరు చికిత్సల కోసం ఒకసారి మూడు లక్షలు మరొకసారి రెండు లక్షలు ఖర్చు చేయవచ్చు. మొత్తం పరిమితి ఐదు లక్షల నుంచి చేయకూడదు. ఇది పూర్తిగా కాగిత రహితం, నగదు రహితం. రికార్డు పొందిన వాళ్లు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో ఆసుపత్రి ఖర్చు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
ఆయుష్మాన్ భారత్ యోజన పరిధిలోకి కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు. ఈ కార్డు పొందడానికి వయస్సు, కులం లేదా సభ్యుల సంఖ్య పై కూడా పరిమితులు లేవు. ఆయుష్మాన్ కార్డు ద్వారా మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కూడా చికిత్స పొందవచ్చు. 2024లో కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల వయసు పైబడిన వారికి ఆయుష్మాన్ భవందనకార్డును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎటువంటి ఆదాయపరిమితి లేకుండా 70 ఏళ్ల వయసు పైబడిన వారందరూ కూడా ఈ కార్డు ద్వారా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో ఉచిత చికిత్స ప్రయోజనాన్ని పొందవచ్చు.