AP New Ration Cards: ఏపీ రాష్ట్రమంత్రి నాదెండ్ల మనోహర్ మే నెల నుంచి ఆధునిక రేషన్ కార్డులు జారీ చేస్తామని అలాగే ధాన్యం కొనుగోలు, స్మగ్లింగ్ నియంత్రణ, రైతుల సాయం వంటి చర్యలను కూడా చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో ఉన్న కొత్త రేషన్ కార్డులను ప్రజలకు జారీ చేయబోతున్నట్లు తెలిపారు. కొత రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్, భద్రతా ఫీచర్లు వంటి ఆధునిక సదుపాయాలతో త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. కొత్త రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత త్వరలో కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నట్లు ఆయన స్పష్టంగా తెలిపారు.
Also Read: UIDAI రూల్స్ ప్రకారం ఆధార్ కార్డులో పేరు, చిరునామా, వయస్సును ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా.!
ఈ వార్తతో ఏపీ ప్రజలకు భారీ ఊరట కలగనుంది. అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు. తమకు నచ్చిన మిల్లుకు తీసుకొని వెళ్లి రైతులు ధాన్యం అమ్ముకోవచ్చు అని ఆయన చెప్పుకొచ్చారు.
అలాగే వాట్సాప్ ద్వారా కూడా ధాన్యం విక్రయం ప్రారంభమైందని, ఇప్పటివరకు ఇందులో 16 వేల మంది రైతులు భాగస్వామ్యం అయ్యారని, దాంతో ధాన్యం విక్రయం సులభం అయ్యిందని మంత్రి చెప్పుకొచ్చారు.
రైతులకు గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా సమర్థవంతమైన చర్యలను కూడా తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వివరించారు. మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన బియ్యాన్ని గోదాముల వద్ద నిలువచేసి, ప్యాకింగ్ చేయించే కార్యక్రమం కొనసాగుతుంది.
అలాగే రబీ సీజన్లో కూడా ధాన్యం కొనుగోలు కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. రేషన్ బియ్యం స్మగ్లిన్ పై కఠినంగా వ్యవహరిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేసిన వారికి పీడీ యాక్ట్ కింద కఠిన శిక్షలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.