Ration Cards: వీళ్ళందరూ రేషన్ కార్డులు రద్దు చేసిన ప్రభుత్వం.. ఇకపై రేషన్ బియ్యం, చక్కెర నిలిపివేత

Ration Cards
Ration Cards

Ration Cards: రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి ప్రభుత్వం ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. దీనికి సంబంధించి తనిఖీలు కూడా జరుగుతున్నాయి. అనర్హులైన వారిని రేషన్ కార్డు నుంచి తొలగిస్తున్నారు. త్వరలో వేల సంఖ్యలో రేషన్ కార్డులు ప్రభుత్వం రద్దు చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం విచారణ కూడా చేపట్టింది. అనర్హులైన రేషన్ కార్డు వారిని గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల సంఖ్యను గమనించినట్లయితే ఆ రేషన్ కార్డులలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినవి సుమారు 1.05 లక్షలు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసినవి సుమారు 1.51 లక్షలు ఉన్నాయని సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఈ రెండు జాబితాలను పరిశీలించిన తర్వాత అందులో మొత్తం 1690 బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసింది.

కేంద్ర ప్రభుత్వం గత నెలలోనే ఈ మొత్తం వివరాలను జిల్లా అధికారులకు కూడా పంపించే ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి తహసిల్దార్ లో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. అధికారులు చేపట్టిన విచారణలో మొత్తం 1532 యూనిట్లు అనర్హులు అని తేలింది. సబ్సిడీ ద్వారా ప్రభుత్వ అందిస్తున్న బియ్యాన్ని అనర్హులు అన్యాయంగా పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు ఈ యూనిట్లకు సంబంధించి బియ్యం సరఫరాను నిలిపి వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

అయితే వీళ్ళందరూ కూడా గత ఆరు నెలల నుంచి రేషన్ తీసుకోకపోవడం వలన వీళ్ళ గురించి కేంద్ర అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తును మొదలుపెట్టింది. అలాగే ఇతర రాష్ట్రాలలో కూడా కొంతమందికి రేషన్ కార్డులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి రేషన్ కార్డు సౌకర్యాన్ని కొంతమంది పొందినట్లు అధికారులు గుర్తించారు. అర్హత లేని మైనర్ల పేరు మీద కూడా రేషన్ కార్డులు ఉన్నట్లు డీఎస్ఓ మల్లికార్జున్ బాబు వెల్లడించడం జరిగింది. అయితే అధికారికంగా వీళ్ళందరికీ కోటా నిలిపివేత పై ఇంకా ఉత్తర్వులు రావాల్సిందిగా తెలిపారు.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now