Anasuya: ఒకప్పుడు బుల్లితెర మీద తన అందంతో,చురుకైన మాటలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం అనసూయ వరుస సినిమా అవకాశాలతో బిజీ గా ఉన్నారు.అయితే అనసూయ యెంత బిజీ గా ఉన్న కూడా సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతిదీ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను,వీడియొ లను అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంటూనే ఉంటారు.
ఇక ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో అందరికి తెలిసిందే.ఇక అనసూయ మాత్రం ఎవ్వరు ఎన్ని రకాలుగా మాట్లాడిన,ట్రోల్ చేసిన కూడా తగ్గేదేలే అంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంది.తనను ట్రోల్ చేస్తున్న వారికి చాల సార్లు క్లాస్ కూడా పీకింది అనసూయ.అయితే తాజాగా దసరా పండుగా సందర్భంగా అనసూయ జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తున్న వీడియొ ఒకటి షేర్ చేయడం జరిగింది.ఈ వీడియొ ను షేర్ చేస్తూ అనసూయ ట్రోలర్స్ కి షాక్ ఇస్తూ మహిళలను ప్రోత్సహించేలాగా ఓకే నోట్ కూడా రాసుకొచ్చింది.
ఈ సమాజంలోని దుష్ట శక్తులపై పోరాడుతూ సామాన్య మహిళా నుంచి కాళిగా మారాల్సిన అవసరం ఉందంటూ…ఈ దసరాను చెడుపై మంచి సాధించిన విజయంలా జరుపుకోండి…సోమరితనాన్ని జయించండి అంటూ రాసుకొచ్చింది అనసూయ.స్త్రీ శక్తిని ఎప్పుడు మర్చిపోవద్దు.ఎవరు ఏమన్నా సరే ని శక్తిని నమ్ముకో.నీకిప్పుడు అవసరమా ఆంటీ..35 దాటినా ఎందుకివన్నీ…ఇంట్లో పిల్లలను చూసుకోవచ్చు కదా..వంటివి ఎన్నో కామెంట్స్ కనిపిస్తుంటాయి.ఈ విధంగా కామెంట్స్ చేసే వాళ్లంతా ఎదుగుదలను చూసి భయపడేవాళ్ళే అని తన నోట్ లో రాసుకొచ్చింది అనసూయ.ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
View this post on Instagram