Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లో భార్యాభర్తల కోసం కూడా ఒక మంచి పెట్టుబడి పథకం అందుబాటులో ఉంది. నెలవారి పెట్టే ఈ పథకంలో మీరు జంటగా పెట్టుబడి పెట్టినట్లయితే నెల నెల మీరు రూ.9,250 ఆదాయం పొందవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా సురక్షితమైన మరియు ప్రభుత్వ హామీతో ఉన్న పోస్ట్ ఆఫీస్ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా దంపతుల కోసం కూడా పోస్ట్ ఆఫీస్ లో చాలా సురక్షితమైన పెట్టుబడి పథకం ఉంది. భార్యాభర్తలు జంటగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన ప్రతినెల మంచి ఆదాయం పొందవచ్చు.
వివాహం తర్వాత దంపతులు తమ ఆర్థిక భవిష్యత్తుకు అండగా పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దంపతుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీస్ లో ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకంలో మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం వలన ప్రతినెల స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. నెల నెల వచ్చే స్థిరమైన ఆదాయంతో మీరు ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. దంపతుల కోసం పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పథకం పేరు మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ స్కీంలో మీరు ప్రతి నెల స్థిరమైన వడ్డీ రూపంలో పొందవచ్చు.
ఈ పథకంలో మీరు సింగిల్ గా లేదా జాయింట్ గా కూడా అకౌంట్ తెరవచ్చు. దంపతులుగా మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మీరు ఎక్కువ డబ్బులను పొందవచ్చు. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పథకంలో పోస్ట్ ఆఫీస్ ఏడాదికి 7.4% వడ్డీ రేటు అందిస్తుంది. ఇక ఈ స్కీం సెక్యూరిటీ సమయం ఐదేళ్లు. ఆ తర్వాత కూడా మీరు ఈ స్కీము అవసరమైతే పొడిగించుకోవచ్చు. మీరు ఈ పథకంలో సింగిల్ గా అయితే ఖాతాలో తొమ్మిది లక్షలు లేదా జాయింట్ గా అయితే ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. కనీసం గా మీరు ఇందులో వెయ్యి రూపాయలు కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు.