Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పెళ్లికి వందనం పథకం కింద రూ.13 వేల రూపాయల చొప్పున తల్లుల బ్యాంకు ఖాతాలో నగదును జమ చేసింది. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద నగదు జమ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం పేరుతో రాష్ట్రంలో ఉన్న తల్లులకు ఆనందాన్ని కలిగించింది.
సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వాళ్లందరికీ తల్లికి వందనం పథకం కింద నగదు ఇచ్చింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.13000 చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాలో డబ్బును జమ చేసింది. ఎన్నికలలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తూ తాజాగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజే ప్రభుత్వం అందించిన ఈ సహాయం పేద కుటుంబాలకు ఆనందం కలిగించింది.
తల్లికి వందనం పథకం కింద అన్నమయ్య జిల్లాలో ఉన్న ఒక ఉమ్మడి కుటుంబంలో 12 మంది పిల్లలకు ఈ పథకం కింద డబ్బులు జమ అయ్యాయి. కలకడకు చెందిన హుసేనుల్లా అనే వ్యక్తికి నలుగురు కుమారులు ఆ నలుగురు కొడుకులకు కలిపి మొత్తం 12 మంది పిల్లలు ఉన్నారు. ఈ 12 మంది పిల్లలకు తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ అయ్యాయి. ఈ 12 మంది పిల్లలకు కలిపి మొత్తం రూ.1.56 లక్షల నగదు తల్లికి వందనం పథకం కింద జమ అయ్యింది. ఈ పేదరిక కుటుంబానికి ఒకేసారి 12 మంది పిల్లలకు కలిపి ఇంత నగదు రావడంతో ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు కూడా తెలిపారు.