Pawan Kalyan: ఈ ఏడాది నవంబర్ 1 న ఇటలీ లో వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి పెళ్లి జరగబోతున్న సంగతి అందరికి తెలిసిందే.ఇక ఈ పెళ్లి కి హాజరయ్యేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇప్పటికే ఇటలీ బయలుదేరారు.శుక్రవారం రోజు హీరో నితిన్ తన భార్య షాలి తో కలిసి హైదరాబాద్ విమానాశ్రయం లో కనిపించారు.ఈ రోజు పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా తో కలిసి ఇటలీ కి బయలుదేరారు.ఇప్పటికే వరుణ్,లావణ్య పెళ్లి కోసం మెగా,అల్లు కుటుంబాలు ఇటలీ చేరుకున్నాయి.
రామ్ చరణ్ తన భార్య ఉపాసన,కూతురు క్లిన్ కార తో కలిసి కొద్దీ రోజులుగా ఇటలీ లోనే ఉంటూ వరుణ్ పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు అని సమాచారం.ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు కొంత మంది ఇటలీ చేరుకున్నారు.ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా తో కలిసి హైదరాబాద్ విమానాశ్రయం లో కనిపించారు.
ఎరుపు,ఆకుపచ్చ హాఫ్ స్లీవ్ చెకర్డ్ షర్ట్ లో పవన్ కళ్యాణ్ చేతిలో పుస్తకం తో హైదరాబాద్ విమానాశ్రయం లో కనిపించారు.విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు ఆయన అభిమానులతో పాటు అక్కడ ఉన్న వారిని కూడా ఆకట్టుకుంది.వరుణ్,లావణ్య వివాహం వారి కుటుంబ సభ్యులతో పాటు సినిమా పరిశ్రమలో కూడా ఉత్సాహాన్ని సందడిని నెలకొల్పింది అని చెప్పచ్చు.వరుణ్,లావణ్య వివాహం ఘనంగా ఇటలీ లోని టుస్కా లో జరగనుంది.నవంబర్ 1 న వీరిద్దరి పెళ్లి జరగనుంది.ఇక పెళ్లి సెలెబ్రేషన్స్ అక్టోబర్ 30 నుంచే మొదలు కానున్నాయి.వీరిద్దరి వివాహానికి ఇరువురు కుటుంబ సభ్యలతో పాటు సన్నిహితులు,సినిమా ప్రముఖులు హాజరుకానున్నారు.
Powerstar #PawanKalyan with wife #Annalezhneva off to Italy to attend #varunlav wedding❤️
pic.twitter.com/ejkZAnZYT6— Rusthum (@RusthumlHere) October 28, 2023