ఈ 10 మంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా…

సినిమా ఇండస్ట్రీలో సినిమాలకు చదువుకు పెద్దగా సంబంధం ఉండదు.అందం,అభినయం ఉంది పెద్దగా చదువుకోకపోయినా కూడా స్టార్ హీరోయిన్ లుగా ఎదిగిన వాళ్ళు చాల మందే ఉన్నారు.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారంటే…

రష్మిక మందాన:ప్రస్తుతం తెలుగు లో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక టాప్ స్థానంలో ఉన్నారు.రష్మిక సైకోలజీ లో డిగ్రీ పూర్తి చేసారు.ఇటీవలే రష్మిక పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రకు మంచి ప్రేక్షకాదరణ లభించింది.ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో మిషన్ మజ్ను,గుడ్ బై అనే చిత్రాలలో నటిస్తున్నారు.

పూజ హెగ్డే:పూజ కర్ణాటక లోని MMK కాలేజీలో Mcom పూర్తి చేసారు.ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లలో పూజ ఒకరు.ఇటీవలే పూజ హెగ్డే నటించిన రాధే శ్యామ్ విడుదల అయినా సంగతి అందరికి తెలిసిందే.పూజ నటించిన ఆచార్య,బీస్ట్ సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

నయనతార:నార్త్ లో చదివిన నయనతార కాదా మర్దోమా కాలేజీలో బి ఏ పూర్తి చేసారు.ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవి కు చెల్లెలిగా నటిస్తున్నారు.

అనుష్క:తెలుగులో సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ తర్వాత స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు.ఆమె కార్మెల్ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసారు.

సమంత:చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసారు సమంత.విడాకుల తర్వాత వరుస సినిమా అవకాశాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు సమంత.

తమన్నా భాటియా:తమన్నా ఆర్ట్స్ లో డిగ్రీ చేసారు.ప్రస్తుతం తమన్నా ఎఫ్ 3 ,భోళా శంకర్ అనే సినిమాలలో నటిస్తున్నారు.

కాజల్ అగర్వాల్:ముంబైలోని కేసి కళాశాలలో మాస్ మీడియా కమ్యూనికేషన్ మార్కెటింగ్ విభాగంలో డిగ్రీ చేసారు.కాజల్ నటించిన ఆచార్య చిత్రం విడుదలకు సిద్ధం గా ఉంది.

రకుల్ ప్రీత్ సింగ్:వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా రకుల్ ఢిల్లీ యూనివర్సిటీలో గణిత విద్యను అభ్యసించారు.ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ లో కూడా సినిమాలు చేస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్.

సాయి పల్లవి:ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు సాయి పల్లవి.ఈమె జార్జియా నుంచి 2015 లో MBBS పూర్తి చేసారు.

కీర్తి సురేష్:నేను శైలజ అనే చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టారు కీర్తి సురేష్.మహానటి అనే చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు.కీర్తి సురేష్ కేరళలోని పర్ల్ అకాడమీ లో ఫ్యాషన్ డిసైన్ లో డిగ్రీ పూర్తి చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *