Shruti Haasan: ఈ మధ్య కాలం లో హీరోయిన్ శృతి హాసన్ నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి.దాంతో శృతి హాసన్ లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.గత సంవత్సరం చిరంజీవి కి జోడిగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మరియు బాలకృష్ణ కు జోడిగా నటించిన వీరసింహ రెడ్డి సినిమా సూపర్ హిట్స్ అయ్యాయి.ఇక ఈ సంవత్సరం కూడా శృతి హాసన్ నటించిన సలార్ సినిమా సంచలన విజయం సాధించింది.సలార్ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది శృతి హాసన్.
శృతి హాసన్ తనను పాన్ ఇండియా స్టార్ గా పిలవడం పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేయడంతో అవి కాస్త ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.తాజాగా ఒక ఇంగ్లీష్ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో శృతి హాసన్ తానూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాదు పదకొండేళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకొచ్చింది.2009 లో నేను బాలీవుడ్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.అప్పడు ఓటిటీ లు లేవు.సోషల్ మీడియా కూడా ఎక్కువగా వాడుకలో లేదు.
అప్పుడే ఉండుంటే నా టాలెంట్ చాల మందికి తెలిసి నాకు ఇంకా మంచి పేరు వచ్చేది.అయినా పర్లేదు..అప్పటి పరిస్థితుల పట్ల నేను సంతృప్తి గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది శృతి హాసన్.నేను పదకొండేళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్ ని..అప్పటి నా ఇంటర్వ్యూ లు చుస్తే మీకు అర్ధమవుతుంది.
Also read : దాదాపు అందరు హీరోలతో నటించిన సమంత…ప్రభాస్ తో ఎందుకు నటించలేదో తెలుసా..!
అప్పుడే నేను పాన్ ఇండియా స్టార్ అనే పదాన్ని కూడా వాడటం జరిగింది.పాన్ ఇండియా పై నాకు ఇంటరెస్ట్ లేదు.నేను అన్ని భాషలలో సినిమాలు చేశాను.ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పుకుంటున్న హీరోయిన్ లతో నన్ను పోల్చకండి.కొన్నేళ్ల క్రితమే నేను పాన్ ఇండియా సినిమా లు చేశాను.నేను డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాను.నన్ను ఎవరితోనైనా పోల్చితే నాకు నచ్చదు అంటూ తెలిపింది శృతి హాసన్.
View this post on Instagram